Please enable javascript.

Awfis Space IPO Allotment Status : ఆఫిస్ స్పేస్ ఐపీఓ షేర్ల కేటాయింపు ఈరోజే.. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 28 May 2024, 12:01 pm

ఆఫిస్ స్పేస్ ఐపీఓ షేర్ల అలాట్మెంట్ ఈరోజే జరుగుతోంది. ఐపీఓ రిజిస్ట్రార్ వెబ్ సైట్ తో పాటు బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.

 
​Awfis Space IPO Allotment Status​

Representative Image


ఆఫిస్ స్పేస్ ఐపీఓ షేర్ల కేటాయింపు ప్రక్రియ ఈరోజే (మే 28) పూర్తి కానుంది. ఐపీఓ కోసం దరఖాస్తు చేసిన వారు ఆన్ లైన్ లో రిజిస్ట్రార్ పొర్టల్ లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. బీఎస్ఈ డేటా ప్రకారం ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. మే 22న ప్రారంభమై, మే 27 తో ముగిసే సమయానికి 108.56 రెట్లు సబ్ స్కైబ్ అయింది. ఆన్ లైన్లో ఐపీఓ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • ఈ పేజీలో కన్పించే ఆప్షన్లలో సెలక్ట్ కంపెనీ దగ్గర డ్రాప్ డాన్ లిస్టు నుంచి ఆఫిస్ స్పేస్ పేరు సెలక్ట్ చేసుకోవాలి.

  • సెలక్షన్ టైప్ దగ్గర కన్పించే డ్రాప్ డౌన్ మెనూ నుంచి అప్లికేషన్ నంబర్, బెనిఫిషియరీ ఐడీ, పాన్ నంబర్ లలో ఏదైనా ఒకదానిని సెలక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పాన్ నంబర్ సెలక్ట్ చేసుకుంటే ఆ సంఖ్యను ఎంటర్ చేయాలి.

  • చివరగా బాక్సులో కన్పించే క్యాప్షాను కరెక్టుగా ఎంటర్ చేయాలి. అనంతరం సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే షేర్లు అలాట్ అయ్యాయో లేదో డిస్ ప్లే అవుతుంది.

బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్లో..


  • ఈ పేజీలో కన్పించే ఆప్షనల్లో ఇష్యూ టైప్ దగ్గర ఈక్విటీ ఎంపిక చేసుకోవాలి.

  • ఇష్యూ నేమ్ దగ్గర కన్పించే డ్రాప్ డౌన్ మెనూలో ఆఫిస్ స్పేస్ పేరు సెలక్ట్ చేసుకోవాలి.

  • అప్లికేషన్ నంబర్ లేదా పాన్ నంబర్లలో ఒక దానికి ఎంపిక చేసుకోవాలి. అనంతరం ఎంపిక చేసుకున్న నంబర్ ఎంటర్ చేయాలి.

  • అయామ్ నాట్ రోబో పై టిక్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు షేర్లు అలాట్ అయ్యోయో కాలేదో డిస్ ప్లే అవుతుంది.

  • ఆఫిస్ స్పేస్ ఐపీఓ షేర్లు అలాట్ అయినవారికి డీమ్యాట్ ఖాతాల్లో మే 29, బుధవారం జమ అవుతాయి. షేర్లు అలాట్ కాని వారికి రీఫండ్ ప్రక్రియ కూడా మే 29న ప్రారభం అవుతుంది. స్టాక్ మార్కెట్లో షేర్లు మే 30న లిస్ట్ అవుతాయి.
జీఎంపీ ఎంత?
ఆఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ జీఎంపీ ఈరోజు రూ. 129 గా ఉంది. అంటే ఐపీఓ ఇష్యూ ధర కంటే ఒక్కో షేరుకు రూ. 129 అధికంగా చెల్లించేందుకు ఇన్వెస్టర్లు సిద్దంగా ఉన్నారు. ఇది 33.68 శాతం ప్రీమియాన్ని సూచిస్తుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 383 కాగా, రూ. 512 వద్ద షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే జీఎంపీ రోజు రోజుకు మార్కెట్ పరిస్థితిని బట్టి మారుతుంది.

భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More