Please enable javascript.

Income Tax Returns : ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్నా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలా..?

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 26 Jun 2024, 4:59 pm

పాత, కొత్త పన్ను విధానాల్లో ఆదాయపు పన్ను పరిమితులు రూ. 5 లక్షలు, రూ. 7 లక్షలుగా ఉన్నాయి. మరి ఇంత కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలా? ఈ సందేహానికి సమాధానాలు కింది కథనంలో తెలుసుకోండి.

 
ITR

Representative Image


ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. అయితే పన్ను చెల్లించే అవసరం లేకపోయినప్పటికీ కనీస పన్ను మినహాయింపు పరిమితి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రాస్ శాలరీ పన్ను మినహాయింపు పరిమితిని దాటితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కచ్చితంగా ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. మరి ఐటీఆర్ ఎలాంటి సందర్బాల్లో ఫైల్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
పాత పన్ను విధానం ప్రకారం నికర ఆదాయం రూ. 5 లక్షలు దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి, అదే కొత్త పన్ను విధానం అయితే రూ. 7 లక్షల ఆదాయం దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ రిబేట్ మినాయింపు పొందిన తర్వాత ఆదాయం ఇంత మొత్తం దాటితే పన్ను పరిధిలోకి వస్తారు.

పాత పన్ను విధానం ద్వారా ట్యాక్స్ రిబేట్ రూ. 12,500, కొత్త పన్ను విధానం ద్వారా రూ. 25,000 ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. ఈ మనహాయింపు తర్వాత మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోతే మీరు ఒక్క రూపాయి కూడా ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ వీరు కూడా జీరో ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

చాలా మంది ట్యాక్స్ పేయర్స్ సాధారణంగా తాము ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తారు. అందుకే వారు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయరని ట్యాక్స్ స్పానర్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ సుధీర్ కౌశిక్ తెలిపారు. పన్ను మినహాయింపులకు ముందు గ్రాస్ ఇన్ కమ్ కనీస పన్ను మినహాయింపు పరిమితిని దాటితే కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

  • పాత పన్ను విధానం ప్రకారం కనీస పన్ను మినహాయింపు పరిమితి 2.5 లక్షలుగా ఉంది. అదే 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కులకు అయితే రూ. 3 లక్షలుగా ఉంది. 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 5 లక్షలుగా ఉంది.

  • కొత్త పన్ను విధానంలో అయితే అందరికీ కనీస పన్ను మినాహాయింపు పరిమితి రూ. 3 లక్షలుగా ఉంది.

ఉదహారణకు నెట్ ట్యాక్సబుల్ ఇన్ కమ్ రూ. 4.25 లక్షలుగా ఉంది అనుకుందాం. ఇది పాత పన్ను విధానంలో అయితే రూ. 5 లక్షల కంటే తక్కువగానే ఉంది. అయినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రాస్ టోటల్ కనీస పన్ను మినహాయింపు పరిమితిని దాటింది కాబట్టి పన్ను కట్టాల్సిన అవసరం లేకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయాలని పేర్కొన్నారు.

మరో ఉదారణను తీసుకుంటే రూ. 7.5 లక్షల ఆదాయం గల వ్యక్తి స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆదాయం రూ. 7 లక్షలు అవుతుంది. కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 7 లక్షల ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కనీస పన్ను మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలకు మించి ఆదాయం ఉంది కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేయాలి. అయితే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. దీన్నే జీరో ట్యాక్స్ ఐటీఆర్ గా చెబుతున్నారు. కాబట్టి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయాలి. కాగా, ఐటీఆర్ ఫైలింగ్ కు జూలై 31 చివరి తేదీ. పన్న�� పరిధిలోకి వస్తే గడువు ముగిసే లోగా ఐటీఆర్ ప్రక్రియ పూర్తి చేయండి. లేదంటే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.

Personal Finance, ఆదాయపు పన్నుకు సంబంధించి మరింత సమాచారంతో పాటు లేటెస్ట్ అప్‌డేట్స్ పొందడం కోసం Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగును సందర్శించండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More